![Telugu Post](https://i1.feedspot.com/5530329.jpg?t=1680173260)
Telugu Post
2 FOLLOWERS
Telugu Post
4h ago
పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలు, పచ్చి అబద్ధాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం పర్యటన సందర్భంగా తాను చేసిన తప్పులను గుర్తు చేసుకోకుండా జగన్ పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. చేసిన తప్పులను ఒప్పుకొని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరానికి సంబంధించిన అంశాలను చాలా దుర్మార్గంగా ఎష్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారన్నారు.
నాలుగేళ్లు పడుతుందట...
చివరకు పోలవర ..read more
Telugu Post
4h ago
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించడంతో ఆమె విజయవాడలో ఒక కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు. కొత్త ఆటోనగర్ లోని పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కు చెందిన నాలుగు అంతస్థుల భవనాన్ని వంగలపూడి అనిత తన ఇంటి కోసం అద్దెక తీసుకున్నారు.
క్యాంప్ కార్యాలయంగా...
నాలుగు అంతస్థుల ఈ భవనంలో నివాసంతో పాటు క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకోవాలని వంగలపూడి అనిత నిర్ణయించారు. ఆమె తన కుమార్తెతో కలసి గృహప్రవేశం చేశారు. పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ ఆఫీస్ గా ఇదే కొనసాగనుంది.
..read more
Telugu Post
5h ago
ఈనెల 21, 22 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనుననాయి.రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ నెల 24వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం తాజాగా మార్పు చేస్తూ ఈనెల 21, 22 ..read more
Telugu Post
5h ago
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పథకాలకు పేర్లు మార్చింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేర్లను మార్చింది. ఆ పేర్ల స్థానంలో పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరుగా మార్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం విద్యార్థుల కోసం ఇచ్చే ప్రయోజనాలకు జగన్ తన పేర్లను పెట్టుకున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని అంబేద్కర్ ఓవర్ సీస్ పధకంగా మార్చింది. వైఎస్సార్ కల్యాణ మస్తు పథకాన్ని చంద్ర పెళ్లికానుకగా మార్చింది.
మిగిలిన వాటికి కూడా...
అయితే కొత్త ప్రభుత్వం ఈ రెండు స్కీమ్ లను కొనసాగించాలని నిర్ణయించుకోవడంతో ఆ పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరెండు పథకాలకు సంబంధించి ప ..read more
Telugu Post
5h ago
ఏడేళ్ల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయానికి వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలోకి అడుగు పెట్టారు. 2017 ..read more
Telugu Post
6h ago
ఆంధ్రప్రదేశ్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలయింది. ఈ నెల 25వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జులై 2వ తేదీ తుది గడువుగా పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 2 ..read more
Telugu Post
9h ago
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొలి సంతకమే మెగా డీఎస్సీపై చంద్రబాబు పెట్టారు. అన్నా క్యాంటిన్లను తెరుస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. ఇలా అన్ని పనులు చేస్తున్న చంద్రబాబు వరస నిర్ణయాలతో ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయోనంటూ ప్రజలు మాత్రం ఆశతో ఎదురు చూపులు చూస్తున్నారు.
ఉచిత ప్రయాణం...
ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ..read more
Telugu Post
10h ago
రేపు పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లనున్నారు. పార్టీ ఓటమి చెందిన తర్వాత తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఆయన పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో అక్కడ భేటీ కానున్నారు. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ వద్ద జగన్ నేతలతో సమావేశమై వారికి భరోసా ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 21వ తేదీన పులివెందుల నుంచి తాడేపల్లికి చేరుకోనున్నారు.
ముందుగా నిర్ణయించిన...
అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం పార్టీ నేతలతో జగన్ భేటీ వాయిదా పడింది. ఆ సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్న కీలక భేటీ ఈ నెల 19 ..read more
Telugu Post
11h ago
నిన్న రైలు ప్రమాదం సంభవించిన మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 24 గంటలలో ఆ రూట్ లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. నిన్న ఉదయం పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో కాంచన్జంగా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ ను వెనక నుంచి వచ్చిన రైలు ఢీకొన్న ఘటనలో 9 ..read more
Telugu Post
11h ago
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఊహించని విజయంగానే చూడాలి. బలమైన కేసీఆర్ ను ఎదుర్కొని తాము అధికారంలోకి రాగలమా? అన్న సందేహాలు ఎన్నికలకు ముందు వరకూ అనేక మంది నేతల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతోనూ, కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుబంధం కారణంగా పార్టీలోనే ఉంటూ విజయానికి కృషి చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మన సమస్యలన్నీ తీరినట్లేనని అందరూ భావించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో టిక్కెట్ రాని నేతలు, పదేళ్లపాటు పార్టీ జెండాను దించకుండా మోసిన ముఖ్య కార్యకర్తలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
ఏదో ఒక పదవి....
కాం ..read more