T News
1 FOLLOWERS
TNews Telugu is a Telugu news website in the Indian state of Telangana. The website is owned by Telangana Broadcasting Private Limited. The website focuses exclusively on news, events, and culture of the Telangana. The website brings up
history, self-respect of Telangana.
T News
1w ago
కెనడాకు చెందిన బిలియనీర్ ఫ్రాంక్ స్ట్రోనాచ్ను అరెస్టు చేశారు పోలీసులు. అత్యాచారం,లైంగిక దాడి ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టొరంటో శివారు ప్రాంతమై అరోరాలో 91 ఏళ్ల వ్యాపారవేత్త ఫ్రాంక్ స్ట్రోనాచ్ అరెస్టు చేశారు. 1980 నుంచి 2023 ..read more
T News
1w ago
నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ అందుకు వేదికగా నిలవనుంది. రేపు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రమాణస్వీకారోత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. ఎన్డీయే కూటమి నేతలు, విపక్ష నేతలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు మోడీ ప్రమాణస్వీకారానికి రానున్నారు.
శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ తదితర దేశాల అధినేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. 2014లో మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019 ..read more
T News
1w ago
జరిగిన లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలీ, కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే రాహుల్ గాంధీ రెండో సీటును వదులుకోనున్నట్లుగా సమాచారం. యూపీలో పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడం కోసం రాయ్ బరేలీ సీటును అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నారు. వయనాడ్ నుంచి రెండోసారి గెలిపించినందుకు ఈ సీట్లోనే కొనసాగాలని కేరళ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అయితే యూపీపై దృష్టి సారించాల్సి ఉందన్న   ..read more
T News
1w ago
ఒకరంటే ఒకరికి ఇష్టం. దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఉన్న ఊరిని వదిలి వేరే గ్రామానికి వెళ్లి కలిసి బతుకుతున్నారు.ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఆ ఇద్దరూ మహిళలే. అంతేకాదు వారిద్దరికి పెళ్లయి..పిల్లలు కూడా ఉన్నారు. ఈ వింతైన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజన గూడేనికి చెందిన ఇద్దరు పెళ్లైన మహిళలు గ్రామం నుంచి పరారయ్యారు. వారిలో ఒక మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళకు భర్త, కొడుకు ఉన్నాడు. అయితే ఇటీవల అనారోగ్యంతో కొడుకు మృతిచెందాడు. కాగా…వీళ్లిద్దరూ ఆరునెలల క్రితం గ్రామం నుంచి పరారై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల ప్రాంతంలో రహస్యంగా జీవిస్తున్నార ..read more
T News
1w ago
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. రేపు(ఆదివారం) జరగనున్న గ్రూప్ 1 పరీక్ష కోసం 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్ష నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ   ..read more
T News
1w ago
నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నీట్ ఎగ్జామ్లో 67 ..read more
T News
1w ago
వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో వానలతో ట్రాఫిక్ జామ్, వరద నీటి నిల్వ వంటి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో నిన్న(శుక్రవారం) ఆమె సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలిసేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
హైదరాబాద్లో దాదాపు 134 ..read more
T News
1w ago
దేశంలో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకశ్మీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే అధికారకంగా ప్రారంభించింది. రిజిస్టర్ లేని పార్టీలు గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, వాటిని స్వీకరించి ఆమోదించేందుకు ఈసీ నిర్ణయించినట్లు సెక్రటరీ జయదేబ్ లాహిరి ఇవాళ(శనివారం) ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జేపీ, పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఫ్తీ మహ్మద్ సయీద్ సీఎం అయ్యారు. 2016 ..read more
T News
1w ago
జూన్ 15వ తేదీన 18వ లోక్సభ మొదటి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఈ సెషన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగిన తర్వాత కొత్త స్పీకర్ను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత సెషన్ అధికారికంగా ప్రారంభిస్తారు. సమావేశాల నిర్వహణ తేదీలను కొత్త కేంద్ర మంత్రి వర్గం నిర్ణయిస్తుంది. తర్వాత మోడీ తన మంత్రి మండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు. జూన్ 22న సమావేశాలు ముగిసే అవకాశం ఉంది.
9 ..read more
T News
1w ago
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు అంతా సిద్ధమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రేపు(ఆదివారం) పరీక్ష నిర్వహించనున్నారు. ఇన్ సర్వీసు ఉద్యోగులు, అభ్యర్థులు కోరినట్టుగా పరీక్షను హైకోర్టు వాయిదా వేయకుండా టీజీపీఎస్సీ అధికారులకే నిర్ణయం వదిలేసినట్టు సమాచారం.
దీంతో ప్రకటించిన తేదీనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. రేపు నిర్వహించనున్న పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటలకే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తారు. నిమిషయం ఆలస్యం నిబంధన పెట్టిన అధికారులు
10 ..read more