NTV Telugu
94 FOLLOWERS
Get all the latest Telugu News and Live updates, Andhra Pradesh (AP), Telangana, Sports, Movie reviews and more in Telugu at NTV Telugu. NTV, of Rachana Television P.Ltd (RTPL), is an Indian regional Telugu news channel launched on August 30, 2007 along with South India's first devotional channel Bhakti TV and Vanitha TV, an exclusive channel for women.
NTV Telugu
1h ago
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు వరదలు, తుఫానుల కారణంగా కాచర్, హైలకండి, కరీంగంజ్ జిల్లాలలో ఒక్కొక్కరు మరణించారు. మూడు ప్రధాన నదులు.. కోపిలి, బరాక్, కుషియార ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని (ASDMA ..read more
NTV Telugu
1h ago
Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తన అందం ,నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.వరుసగా గ్లామర్ పాత్రలు చేస్తూనే యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలలో కూడా నటిస్తుంది.ఈ భామ సౌత్ సినిమాలతో పాటు హిందీలో కూడా ఎంతగానో అలరిస్తుంది.రీసెంట్ గా బోల్డ్ సీన్స్ లో నటించకూడదని నియమాన్ని ఈ భామ బ్రేక్ చేసింది.ఈ భామ హిందీలో నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.
Read Also :Prasanna Vadanam ..read more
NTV Telugu
1h ago
ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. కాగా.. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Read Also: Dharmapuri Srinivas Health: మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు అస్వస్థత..
మరోవైపు.. సిక్కింలోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 32 ..read more
NTV Telugu
1h ago
Dharmapuri Srinivas Health: నిజామాబాద్ మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కు అస్వస్థతకు గురయ్యారు. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్ తో హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐ.సి.యూలో డి.ఎస్. చికిత్స పొందుతున్నారు. తండ్రి అనారోగ్యం విషయాన్ని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మా నాన్న డి. శ్రీనివాస్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
Read also: Tragedy ..read more
NTV Telugu
1h ago
United States vs Canada Match Starts: అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం అయింది. మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కెనడాతో అమెరికా ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. ఆదివారం (జూన్ 2) ఉదయం 6 గంటలకు ఆరంభం అయింది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
క్రికెట్కు అంతగా ప్రాధాన్యం లేని అమెరికా.. వెస్టిండీస్తో కలిసి టీ20 ప్రపంచకప్కి ఆతిథ్యమివ్వబోతుండడం విశేషం. వెస్టిండీస్లో 2010 ..read more
NTV Telugu
1h ago
Prasanna Vadanam : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలను ఎంపిక చేసుకొని సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.ఈ యంగ్ హీరో ఈ ఏడాది నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సూపర్ హిట్ అయింది.సుహాస్ కెరీర్ లోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా తరువాత సుహాస్ నటించిన శ్రీరంగనీతులు అంతగా ఆకట్టుకోలేదు.రీసెంట్ గా సుహాస్ నటించిన మరో మూవీ ప్రసన్న వదనం .ఫేస్ బ్లైండ్నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా మే ౩ న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
Read Also :Chandini Chowdary ..read more
NTV Telugu
1h ago
ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also: Boat Capsized : నది దాటుతుండగా బోటు బోల్తా .. 20 మంది మృతి
మృతులు.. బుదౌన్ జిల్లాకు చెందిన ప్రకాష్ (42), బ్రజ్పాల్ (35), ధనపాల్ (55), జ్ఞాన్ సింగ్ (40 ..read more
NTV Telugu
1h ago
Boat Capsized : తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఇక్కడ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఈ ఘోర ప్రమాదంలో దాదాపు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై తాలిబన్ అధికారి ఒకరు సమాచారం అందించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా బోటు బోల్తా పడిందని, దీంతో బోటులో ఉన్న వారంతా మునిగిపోయారని నంగర్హర్ ప్రావిన్స్లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో నీటిలో మునిగి 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 ..read more
NTV Telugu
1h ago
India Crush Bangladesh in T20 World Cup 2024 Warm-up Match: టీ20 ప్రపంచకప్ 2024కు ముందు శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 183 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఓడింది. మహ్మదుల్లా (40 రిటైర్డ్ హర్ట్ ; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రిషబ్ పంత్ (53 రిటైర్డ్ ఔట్; 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), శివమ్ దూబె (14 రన్స్, 2 వికెట్స్) కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ (23; 19 బంతుల్లో)తో కలిసి సంజు శాంసన్ ఓపెనింగ్ చేశాడు. ఐపీఎల్ 2024 ..read more