Telugu Global
6,157 FOLLOWERS
Telugu Global is intended to give news with Live Updates with analysis over latest political issues and telugu movie reviews.
Telugu Global
3m ago
2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఓటర్ల లిస్ట్ కూడా పక్కాగా తయారైంది. ఏపీలో మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో పురుషులు 2,00,09,275 మంది కాగా, మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్ 3,482.. సర్వీస్ ఓటర్లు 67,434 ..read more
Telugu Global
3m ago
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
మృతుల్లో ఓ చిన్నారి...
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ చిన్నారికి చెవులు, ముక్కులు కుట్టించడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్ ..read more
Telugu Global
3m ago
భారత యువబ్యాటర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ 100 మ్యాచ్ ల క్లబ్ లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ ద్వారా ఈ ఘనత సాధించాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 24 సంవత్సరాల వయసులోనే 100 ఐపీఎల్ మ్యాచ్ ల రికార్డు సాధించాడు. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన 9వ రౌండ్ మ్యాచ్ బరిలో నిలవడం ద్వారా శుభ్ మన్ వంద మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగాడు.
కోల్ కతా టు అహ్మదాబాద్...
ఆరేళ్ల క్రితం అండర్ -19 ప్రపంచకప్ లో సత్తా చాటుకోడం ద్వారా కోల్ కతా ఫ్రాంచైజీలో చోటు సంపాదించిన శుభ్ మన్ గిల్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. 2018 నుంచి 2021 ..read more
Telugu Global
1h ago
తీన్మార్ మల్లన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చింది. నల్గొండ - ఖమ్మం- వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్లన్నను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన రిలీజ్ చేశారు.
జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతుంది. ఇదే స్థానం నుంచి గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు మల్లన్న.
2021 ..read more
Telugu Global
1h ago
చాలా పాపులర్ సీనియర్ నటుడు రాజశేఖర్. అయితే హీరోగా ఆయన సినిమాలు చేయడం తగ్గించేశారు. క్యారెక్టర్ రోల్స్, ప్రత్యేక పాత్రలు పోషించడం ప్రారంభించారు. గత సంవత్సరం నితిన్ నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” చిత్రంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు.
అయితే అది పూర్తిస్థాయి పాత్ర కాదు. సినిమా కూడా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు మరో సినిమాతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారబోతున్నారు రాజశేఖర్. ప్రస్తుతం శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నాడు. బైక్ రేసింగ్కు సంబంధించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.
"లూజర్" అనే వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించిన అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా ..read more
Telugu Global
3h ago
ఇటీవల కాలంలో రాజకీయాలపై సినీ, క్రీడా రంగాల్లో ఉన్నవారు కూడా ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎన్నికల బరిలోనూ పోటీపడేందుకు సై అంటున్నారు. తాజాగా ‘పొలిమేర’ చిత్ర నటి అదే బాటలో నడిచారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ఆమె తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్కు సమర్పించారు.
‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’, ‘పొలిమేర 2 ..read more
Telugu Global
3h ago
నామినేషన్ల గడువుకు ఒక్కరోజు ముందు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ కాంగ్రెస్ బుధవారం రాత్రి ప్రకటించింది. హైదరాబాద్ లోక్సభ స్థానానికి మహమ్మద్ సమీర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను అందులో వెల్లడించారు. ఇందులో ఆసక్తికరమైన విషయమేమంటే.. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్కు స్వయానా వియ్యంకుడు కావడం.
హీరో వెంకటేశ్ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అంతేకాదు.. రఘురాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా వియ్యంకుడే. మంత్రి పొంగులేటి శ ..read more
Telugu Global
5h ago
హార్ట్ స్ట్రోక్ సమస్యతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు కూడా ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయని స్టడీలు చెప్తున్నాయి. ఉన్నట్టుండి మెదడుకి రక్తప్రసరణ ఆగిపోవడం ద్వారా ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన మెదడుపోటుని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల తలెత్తే పోటును బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. హార్ట్ స్ట్రోక్ లాగానే ఇది కూడా ఎమర్జెన్సీ కండీషన్. సాధ్యమైనంత త్వరగా ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడొచ్చు. అసలీ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా, ఎందుకు సంభవిస్తుందంటే..
మెదడులోకి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు అత్యంత చిన్న సైజులో సూక్ష్మాతిసూక్ష్మంగా ఉంటాయి. ..read more
Telugu Global
11h ago
సీఎం జగన్ "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర బుధవారంతో ముగిసింది. 22 రోజులు పాటు 2,100 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర 86 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోలు నిర్వహించారు.
టెక్కలి సభలో పంచులే పంచులు..
బాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయతీపరుడు కావాలా? తేల్చుకోవాలన్నారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదన్నారు. 2014 ..read more
Telugu Global
11h ago
Kotak Mahindra Bank | ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ `కొటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)`కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) (Reserve Bank of India - (RBI) గట్టి షాక్ ఇచ్చింది. ఆన్లైన్లో గానీ, మొబైల్ బ్యాంకింగ్ చానెల్ ద్వారా కొత్తగా ఖాతాదారులను చేర్చుకోవద్దని కొటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)ను ఆర్బీఐ (RBI) ఆదేశించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949లోని 35ఏ సెక్షన్ ప్రకారం తనకు సంక్రమించిన అధికారాల ప్రకారం కొటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank ..read more