10 TV
3 FOLLOWERS
10TV Telugu brings you LIVE News in Telugu on Politics, Crime, Business, Media and more. 10tv.in also offers videos of exclusive interviews with the dignitaries of Telugu states and others.
10 TV
3M ago
ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్..
హయత్నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దిల్సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న రెండు ఆటోలు, బైకులు, రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగులగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈడీ విచారణ ..
ఈడీ విచారణకు ఇవాళ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ హాజరుకానున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేస ..read more
10 TV
3M ago
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ పాస్ చేసింది హైకోర్టు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి8 కి వాయిదా వేసింది న్యాయస్థానం.
ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బిగ్ షాక్ తగిలింది. అధికారిక రహస్యాలను వెల్లడించిన కేసులో కోర్టు ఆయనకు 10 ..read more
10 TV
3M ago
బీజేపీతో ఎప్పుడూ చేతులు కలపలేదుఈ దేశ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక రాజకీయ పార్టీ ఏదీ లేదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీని నమ్మాలని, కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దేశంలో బీజేపీతో ఎప్పుడూ చేతులు కలపని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే అన్నారాయన. మాది ప్రజల ప్రభుత్వం అన్న భట్టి విక్రమార్క.. ప్రజా సమస్యల పరిష్కారమే మన అందరి ముందున్న ప్రధాన అజెండా అని చెప్పారాయన. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో భట్టి మాట్లాడారు.
56 ..read more
10 TV
3M ago
రామ మందిర ప్రస్తావన ..
అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రారంభమైన రామ మందిర అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మందిరం దేశ ప్రజలను ఎలా ఐక్యం చేసిందనే విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. శ్రీరాముడి పాలన మన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశారు. లోతైన చర్చలతో రూపొందించబడిన భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో, భారత పౌరుల ప్రాథమిక హక్కులను వివరించడం జరిగిందని ప్రధాని చెప్పారు.
కేసీఆర్ ప్రమాణ స్వీకారం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఫిబ్రవరి 1 ..read more
10 TV
3M ago
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. బిహార్లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకునే యత్నంలో సీఎం నితీశ్ కుమార్ ఉన్నారు. దీంతో బీజేపీ చేపట్టాల్సిన చర్యలు, మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కార్యాలయంలో చర్చలు జరుగుతున్నాయి.
పోట్తెత్తిన భక్తులు ..
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం కావడం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు నిండి వెలుపల వరకు బారులు తీరారు. అంజన్న దర్శనానికి గంటకుపైగా సమయం పడుతుంది. వందలాది వాహనాలతో ఘాటు రోడ్డు, ..read more
10 TV
3M ago
గణతంత్ర వేడుకల్లో చంద్రబాబు..
ఉండవల్లిలోని నివాసంలో గణతంత్ర వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
విషాదం..
ములుగు జిల్లాలో గణతంత్ర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో ముగ్గురు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. గాయలైన వ్యక్తిని హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు.
స్పీకర్ కు పరామర్శ..
స్పీకర్ గడ్డ ప్రసాద్ ను  ..read more
10 TV
3M ago
ప్రొఫెసర్ కోదండరాంకు టీఎన్జీవో కేంద్ర సంఘం శుభాకాంక్షలుతెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాంకు టీఎన్జీవో కేంద్ర సంఘం శుభాకాంక్షలు తెలిపింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు మారం జగదీశ్వర్, తదితరులు ఇవాళ కోదండరాంను కలిశారు. కోదండరాం మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: కేటీఆర్  ..read more
10 TV
3M ago
పవన్ కళ్యాణ్తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. అనకాపల్లిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగసభ, ఉత్తరాంధ్ర అంశాలు పవన్ కళ్యాణ్తో ఆయన చర్చించారు.
కుప్పకూలిన రష్యా విమానంరష్యా విమానం కుప్పకూలి 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. 74 ..read more
10 TV
3M ago
టీడీపీ గేట్లు తెరిస్తే.. వైసీపీ మొత్తం ఖాళీ..!
వైసీపీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారని టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారాయన. ఇంఛార్జిల మార్పు ద్వారా సీఎం జగన్ వైసీపీ ఓటమిని అంగీకరిస్తున్నారని ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు.
ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి కీలక భేటీ
ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారానికి తయారు చేసిన మధ్యంతర నివేదికపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. సచివాలయంలో మంత్రి పొంగులేటితో భేటీ అయిన ధరణి కమిటీ.. భూ సమస్యలపై తయారు చేసిన మధ్యంతర నివేదికను అందించారు. క్షేత్ర స్థాయిలో భూ స ..read more
10 TV
3M ago
ఎమ్మెల్సీలుగా మహేష్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవ ఎన్నికమహేష్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు రెండునామినేషన్లు మాత్రమే రావడంతో మహేష్కుమార్ గౌడ్, వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎమ్మెల్సీ సర్టిఫికెట్లను వారిద్దరు అందుకున్నారు. ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్కు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు.
ధరణి కమిటీ మూడో సమావేశం.. కీలక నిర్ణయాలుతెలంగాణలో ..read more