T News
1 FOLLOWERS
TNews Telugu is a Telugu news website in the Indian state of Telangana. The website is owned by Telangana Broadcasting Private Limited. The website focuses exclusively on news, events, and culture of the Telangana. The website brings up
history, self-respect of Telangana.
T News
41m ago
హిందూ పెళ్లిలు అంటే ఆటపాటలు..విందు భోజనాలు కానేకాదని..అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ అని సుప్రంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న నేత్రుత్వంలోని ధర్మాసనం హిందూ వివాహ ప్రాముఖ్యత, చట్టబద్ధతను వివరించింది. హిందూ వివాహం అనేది సప్తపది చుట్టూ ఏడు అడుగులు నడిచే ప్రక్రియతో ముడిపడి ఉంటుందనిస్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి రుజువు లభిస్తుందని తెలిపింది. కానీ చట్టంలోని సెక్షన్ 7 ..read more
T News
41m ago
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రు. నమ్మి వాళ్లకు ఓటేస్తే ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసిండ్రు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోడంతో ఇప్పుడు నానాగోసలు పడుతున్నాం. ఎంపీ ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ ఆ పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తూ..మాయమాటలు చెప్పేందుకు వస్తుండ్రు. మరోసారి వారి మాటలు విని మేము మోసపోము. మాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. మా గుండెల్లో ఉద్యమనేత కేసీఆర్ సారే ఉన్నాడు. అని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డితో ఉపాధి హామీ కూలీలు కాంగ్రెస్ పై ఉన్న అక్కస్సున్నంతా వెళ్లబోసుకున్నారు.
నిన్న ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంజనరి ..read more
T News
41m ago
తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. బుధవారం ఎండ మరింత పెరిగింది. రానున్న వారం రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఇంకా పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలకు నమోదు అయినట్లు వాతావరణశాఖ పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా గూడాపూర్ లో 46.2 డిగ్రీలుగా నమోదు అయినట్లు వాతావరణశాఖ తెలిపింది. ములుగు జిల్లా మంగపేట, కొత్తగూడెం జిల్లా భద్రచాలం, సూర్యపేట జిల్లా నగాల, నల్లగొండ జిల్లా చండూర్లో 46.5, నల్లగొండ జిల్లా తిమ్మాపూర్, ఖమ్మం జిల్లా వైరా, ఖానాపూర్, జగిత్యాల జిల్లా వెల్గటూర్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలలో 46.4 ..read more
T News
11h ago
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏకంగా తెలంగాణ కీ ఆవాజ్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అని ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదిక ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తప్పుబట్టారు.
ప్రధాని మోదీ విద్వేష వ్యాఖ్యలు ఎన్నికల సంఘంకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. వేలాది మంది ప్రజలు ఫిర్యాదు చేసినా మోదీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బూతులకు ఈసీ చెవులకు ప్రవచనాల్లాగా అనిపించాయా? అని నిలదీశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దరిద్రపు నోటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇది బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్రకాదం ..read more
T News
11h ago
అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద ఎన్నికల సంఘం నిషేధం విధించిందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. 48 గంటలు నా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తే..దాదాపు 96 ..read more
T News
17h ago
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగడం ఏమాత్రం సరికాదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీజేపీ అబ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సిద్ధిపేటలో వెంకట్రామిరెడ్డితో కలిసి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హారీశ్ మాట్లాడుతూ..మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు.
గతలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారంటూ మండిపడ్డారు.బీజేపీ అబద్ధాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దని హరీశ్ రావు సూచించార ..read more
T News
18h ago
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమరని అందరికీ తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రించడంలో సహాయపడుతుందని చాలా మంది అంటుంటారు. వారు. డయాబెటిక్ షేషంట్ అయినప్పటికీ మద్యం సేవిస్తుంటారు. చాలా మంది షుగర్ పేషంట్లు ఇలాంటి వాటిని అస్సలు నమ్మరు. దీంతో మద్యం ఎక్కువగా తాగుతుంటారు. ఆల్కహల్ సేవించడం ద్వారా షుగర్ నిజంగా కంట్రోల్ చేయవచ్చా అనే ప్రశ్నఇప్పుడు తలెత్తుతోంది. అన్నింటికంటే ఆల్కహాల్ తీసుకోవడంలో రక్తం చక్కెరపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. షుగర్ పేషంట్లు మద్యంసేవించవచ్చా ?వీటి గురించి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం.
వెబ్ మెడ్ నివేదిక ప్రకారం..మీకు షుగర్ ఉంటే ఆల్కహాల్ సేవించడం వల్ల మీ రక్తంలో చక్కెర ..read more
T News
20h ago
బాంబు బెదిరింపు కాల్స్ తో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు ప్రముఖ పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారుపోలీసులు.బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్ తోపాటు నోయిడాలోని కనీసం 12 ..read more
T News
22h ago
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్..కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్డు షోలో కేసీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్, ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్..బీఆర్ఎస్ ను ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి సింగరేణిని ముంచేందుకుప్లాన్ చేస్తున్నారంటూ ఆరోపించారు కేసీఆర్.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, వారికి పాలన అందాలని, కొత్తగూడెంలో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీతోపాటు పట్టణాన్నిడెవలప్ చేసుకున్నాము. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను ..read more
T News
22h ago
బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ ఉదయం 6గంటల నాటికి నమోదు అయిన వివరాల ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ. 10తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధర కిలోకి రూ. 100 చొప్పున తగ్గింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో నేడు ఉదయం 6గంటల సమయానికి పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66, 540గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,590గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 66,690గా ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,740గా ఉంది. ముంబైలో కూడా 22 ..read more