Namasteandhra
1 FOLLOWERS
Namasteandhra offers you the opportunity to discuss topics that the whole country is talking about including sports, politics, entertainment, economy and more in Telugu!
Namasteandhra
5h ago
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేసేందుకు మెగా కుటుంబం క్యూ కడుతోంది. ఇప్పటికే.. మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ ఇక్కడే తిష్ట వేసింది. నాగబాబు, ఆయన సతీమణి పద్మ, ఆయన కుమారుడు వరుణ్తేజ్లు నిరాటంకంగా ప్రచారం చేస్తున్నారు. మండలాల వారీగా పంచుకుని ప్రచారాన్ని దుమ్మురేపుతున్నారు. ఇప్పుడు మెగా కుటుంబం నుంచి నాగబాబు కుమార్తె.. కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆమె శుక్రవారం నుంచి నాలుగు రోజులు ప్రచారం చేయనున్నారు.
ఇదేసమయంలో మెగా నటుడు.. ఉప్పెన సినిమా ఫేమ్.. వైష్ణవ్ తేజ్ కూడా ప్ర ..read more
Namasteandhra
19h ago
నవరత్నాలు ఏపీలో జగన్ ప్రజలకు విసిరిన మన్మోహనాస్త్రాలు. 2019 ఎన్నికల్లో నవరత్నాలు ఎంతో సంచలనం సృష్టించి ప్రజలను ఆకర్షించి జగన్ అధికారంలోకి వచ్చాడు. గత ఎన్నికల్లో జగన్ తరపున వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన ఆయన సోదరి షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కడప ఎంపీ లోక్ సభ స్థానానికి పోటీకి దిగింది. జగన్ పాలనపై తాజాగా షర్మిల లేఖ రూపంలో నవ సందేహాలు సంధించింది. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
1. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు?
2. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా?
3. 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు?
4 ..read more
Namasteandhra
1d ago
ఏపీలో పెన్షన్లు , పంపిణీ వ్యవహారంపై నెల రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. వాలంటీర్లను సామాజిక పెన్షన్ల పంపిణీ నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అయితే, సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం…ఎన్నికల్లో లబ్ది కోసం టీడీపీపై బురదజల్లే కార్యక్రమానికి తెరదీసింది. సచివాలయాల వద్దకే వచ్చి పెన్షన్లు తీసుకోవాలని కోరింది. అయితే, అవకాశం ఉన్నా దానిని వినియోగించుకోకుండా వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
దీంతో, ఈ నెల పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్ ..read more
Namasteandhra
1d ago
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తనను మించిన శ్రేయోభిలాషి లేరన్నట్లు మాట్లాడేవారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా 60-70 ..read more
Namasteandhra
1d ago
టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యువగళం, జనగళంలో వచ్చిన వినతులు, బీజేపీ నేతల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోను రూపొందించామని అన్నారు. ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని, ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. ఈ చేత్తో 10 రూపాయలిచ్చిన జగన్ ఆ చేత్తో 1000 కొల్లగొడుతున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్లు మొందు టీడీపీ తెచ్చిన 100 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశాడని మండిపడ్డారు.
13 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్…ప్రతి కుటుంబంపై రూ. 8 ..read more
Namasteandhra
1d ago
వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కొనసాగిస్తూ కొన్ని మార్పులు మాత్రమే చేశారని విమర్శలు వచ్చాయి. ఈ మేనిఫెస్టోతో వైసీపీ ఓటమి సగం ఖాయమైందని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఓటమిని పరిపూర్ణం చేసేలా వైసీపీ మేనిఫెస్టోను తలదన్నే రీతిలో ఈ రోజు టీడీపీ, జనసేనల ఉమ్మడి  ..read more
Namasteandhra
1d ago
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరానికి సరిగ్గా ఇంకో రెండు వారాలే సమయం ఉంది. ఈ సమయంలో తనకు బద్ధ శత్రువులు.. ప్రధాన ప్రతిపక్ష నేతలైన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పోరాడుతూనే.. మరోవైపు తన సొంత సోదరి వైఎస్ షర్మిళతోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రోజు రోజుకూ తన అన్న మీద విమర్శనాస్త్రాల పదును పెంచుతూ పోతోంది షర్మిల. తాజాగా సీబీఐలో తమ తండ్రి వైఎస్ పేరు చేర్పించింది జగనే అన్న విషయాన్ని ఆమె వెల్లడించింది.
ఇదే సమయంలో జగన్ ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో షర్మిళ మీద విమర్శలు గుప్పించాడు. చంద్రబాబు చెప్పినట్లే ఆమె నడుచుకుం ..read more
Namasteandhra
1d ago
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కుమార్తె, టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు.. బ్రాహ్మణి సంబరాల్లో ముని గిపోయారు. “మావారు గెలుస్తున్నారోచ్“ అంటూ.. ఆమె హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. రోడ్ల వెంట తిరుగుతూ.. ఇంటింటికీ వెళ్లారు. ప్రతి మహిళను పలకరించారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రజల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. నిజానికి గత వారం నుంచి మంగళగిరిలోనే ఉంటున్నా.. ఆమె ఇంటింటి ప్రచారం చేయలేదు. ఇప్పటి వరకు తోటలు, పేటల్లో మాత్రమే పర్యటించి.. ప్రచారం చేశారు.
కానీ, మంగళవారం మాత్రం మంగళగిరిలోని ప్రధాన రహదారుల వెంట తిరిగి.. ..read more
Namasteandhra
2d ago
పాఠశాలలో, కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికి ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ ఉంటాయి.
బాల్యంలో తమకు చదువు చెప్పిన గురువులు….తమకు విద్యాబుద్ధులు చెప్పి ఇంతటివారిని చేసిన అధ్యాపకులు…సహ విద్యార్థులు…మిత్రులు…వీరందరినీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
దశాబ్దాల తర్వాతైనా సరే వారందరినీ మరోసారి కలిసి ఆ స్వీట్ మెమొరీస్ ను నెమరువేసుకోవాలని అనుకోని వారుండరు.
ఆ కోవలోనే బందరులో విద్యనభ్యసించిన విద్యార్థులంతా ‘మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక’ కార్యక్రమాన్ని 24 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరి 26 ..read more
Namasteandhra
2d ago
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నేతలను నడిపిస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు అని, వారి రిమోట్ ఆయన దగ్గరే ఉందంటూ ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయడంపై తనకు ఎలాంటి బాధా లేదని, కానీ ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని మాత్రం బాధగా ఉందని జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన అన్న జగన్ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు.
ప్రధాని మోడీతో పాటు ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తున్నారని షర ..read more