Adya News
94 FOLLOWERS
Log on to Adya News Telugu for Latest News Updates in English and Telugu. The film, Telangana and Andhra Pradesh Politics, breaking news updates. Adya News It provides you a great platform to get in touch with the latest entertainment and politics.
Adya News
2h ago
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్…ప్రభుత్వం పై మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేసి మళ్ళీ వాటిని డిలీట్ చేసి..మళ్ళీ ఏదో రాసి….. గందరగోళానికి గురయ్యారు…
తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ..తన ఆవేదన వెళ్లగక్కారు…. అంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేసారు… దీంతో కొందరు దానికి సమాధానంగా అసలు ఆ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది… అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో అయన సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు.
ఇదిలా ఉండగా కృష్ణ జి ..read more
Adya News
7h ago
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పేదంత సొల్లు అని మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్ను తన కూతురు క్రాంతి కలవడంపై స్పందించిన ఆయన…తన కుమార్తె, తనకు మధ్యచిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని ముద్రగడ పద్మనాభం అన్నారు.
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను గాజువాక, భీమవరంలో తన్ని తగలేశారని, ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్ కు ఓటమి తప్పదన్నారు. తన కుమార్తెను పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు లాగారని, మీ ముగ్గురి భార్యలను జనాలకు పరిచయం చేయి అంటూ చురకలు అంటించారు.
కులాలు, కుటుంబాలు మధ్య చిచ్చు పెట్టడం నీ గురువు చంద్రబాబు చెప్పినట్లే నువ్వు నడుచుకుంటున్నావా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చంద్ ..read more
Adya News
9h ago
వేసవిలో మాత్రమే లభించే పండ్లలో ఒకటి మామిడి. పండ్లలో రారాజుగా పిలిచే ఈ పండును తినని వారుండరూ.మామిడిపండులో ఫోలెట్ యాసిడ్, బీటా కెరోటిన్, జింక్, కాల్షియం.. ఇలా చాలా రకాల పోషకాలు సమృద్దిగా లభిస్తాయి. మామిడి పండు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. మామిడిలో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.
అయితే కొంతమంది మామిడి పండ్లు తింటే బాడీలో షుగర్లెవల్స్, బరువు పెరుగుతారని అపోహ ఉంది. మామిడి పండు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే వారికి మామిడిపండ్లు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా ..read more
Adya News
9h ago
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ సినిమాను దిల్ రాజు తెరకెక్కిస్తుండగా రిలీజ్ కోసం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ఇప్పటికే సినిమా చాలా లేట్ అయిందని, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ఈ సినిమాని చాలా లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. పూణే, వైజాగ్, రాజమండ్రి, కర్నూల్, చెన్నై, హైదరాబాద్ చాలా ప్రదేశాల్లో షూట్ జరుగగా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కీలక పాత్రలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. పాల ..read more
Adya News
9h ago
బాలీవుడ్ బ్యూటీ దక్ష నగర్కార్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక ఆస్పత్రిలో తనకు సర్జరీ జరిగిన విధానం, తను పడ్డ బాధలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ సందర్భంగా పలు ఫోటోలు షేర్ చేస్తూ కొన్ని రోజులుగా నేను స్ట్రెచర్పై తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా కష్టంగా అనిపించిందని తెలిపింది. రెండు సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు.
నా ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్ గా నిలిచారు. ఇలాంటి సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమ, కేరింగ్ కి కనిపించని గాయాలను నయం చేసే శ ..read more
Adya News
11h ago
ఎన్నికల ప్రచార పర్వం దగ్గర పడుతున్న కొద్ది దాడులకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు. ప్రజాక్షేత్రంలో తీర్పు ఇప్పటికే అర్థమైపోవడంతో భయబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రౌడీల్ల ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సునీల్ వాహనాన్ని చుట్టుముట్టి కారు అద్దాలు ధ్వంసం చేశారు.
టీడీపీ కార్యకర్తలను దాడికి ఉసిగొల్పుతూ గత కొన్ని రోజులుగా పబ్లిక్ మీటింగ్ల్లో చంద్రబాబు, నారా లోకేష్ స్పీచ్లు ఉండటంతో అరాచక శక్తులుగా మారి టీడీపీ గుండాలు విధ్వంసం సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జంగారెడ్డి గూడెంలో ఎన్నికల ప్రచార ..read more
Adya News
11h ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెండితెరకు పరిచయమై హీరోగా మారిన నటుడు సుహాస్. చిన్న సినిమా దర్శకులకు కేరాఫ్ అడ్రస్గా మారిన సుహాస్ మినిమం హిట్ గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నాడు. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇక ప్రసన్న వదనం సినిమాతో లేటెస్ట్గా హిట్ కొట్టిన సుహాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ రోజు మా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చిందని…. ఇలా ఓ పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తారా అని అడిగారని చెప్పారు. అంతేగాదు అమౌంట్ కూడా భారీగానే ఇస్తామని చెప్పారని వెల్లడించగా నాకు డౌట్ వచ్చి నన్నేనా అని అడిగాను. మిమ్మల్నే సర్ అని చెప్పాడు. అయితే ఆ ఆఫర్ హ్యూజ్ ..read more
Adya News
1d ago
చిదంబరం పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ 6 ..read more
Adya News
1d ago
ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర చర్చజరుగుతోంది. టీడీపీ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకోగా వైసీపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది..ఇప్పుడు అదే పచ్చ మీడియా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుంది..?.ఇక్కడే అర్థమవుతుంది.. ఎలక్షన్స్ సందర్భంగా ప్రజలను భయాందోళన చేయడానికి టీడీపీ, పచ్చ మీడియా ..read more