Mana Telangana
96 FOLLOWERS
Log on to Mana Telangana for Latest Telugu News Updates. Movie News, Telangana and Andhra Pradesh Politics and latest Telugu Breaking News. We are Telangana's Leading Telugu Daily News Paper Which Covers Telangana News, Entertainment, Sports News.
Mana Telangana
42m ago
ఢిల్లీ: ఆ పిల్లాడి పట్టుమని పదేళ్లు లేవు. అతడి పేరు జస్ప్రీత్. అతడి తండ్రి చనిపోయాడు. అయినా మొక్కవోని ధైర్యంతో, రొట్టెలు చేసి అమ్ముతూ బతుకుతున్నాడా బాలుడు. అతడి విషయాన్ని mrsinghfoodhunter ..read more
Mana Telangana
42m ago
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షం లోకి వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలిసి భారత కాలమానం ప్రకారం మే 7 వ తేదీ ఉదయం 8.04 ..read more
Mana Telangana
42m ago
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు? ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆమె నిలదీశారు. గాంధీ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు. బిజెపి వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణని పట్టుకోవాలని ఆమె సవాల్ విసిరారు. నీరవ్ మోడీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని రేణుకా చౌదరి విమర్శించారు. ప్రజ్వల్ రేవణ్ణని బలపరిస్తే తనని బలపర్చినట్టే అని మోడీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.
బిజెపి నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు సైలంట్గా ఉంటున్నారని ఆమె ప్రశ్న ..read more
Mana Telangana
42m ago
ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాసుదారులకు టిఎస్ ఆర్టీసి శుభవార్త తెలిపింది. ఈ పాస్ ఉన్న వారు ఇప్పటి వరకు కేవలం ఎక్స్ ప్రెస్, ఆర్టీనరి బస్సుల్లో మాత్రమే ప్రయాణించడానికి వీలుండేది. తాజాగా ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టిఎస్ ఆర్టీసి కల్పించింది. రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ పాసుదారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని ఆర్టీసి ఎండి సజ్జనార్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
కాగా ఈ కాంబినేషన్ టికెట్ సదుపాయాన్ని వినియోగించుకొని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలని ఆయన సూచించారు. 100 ..read more
Mana Telangana
42m ago
ఒక మహిళను అపహరించి, అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణ సందర్భంగా జెడి (ఎస్) ఎంఎల్ఎ హెచ్డి రేవణ్ణపై కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం బెంగళూరు బసవనగుడిలోని ఆయన నివాసంలో స్పాట్ తనిఖీ నిర్వహించింది. రేవణ్ణ కుటుంబ సభ్యులు ఎవరూ లేనికారణంగా ఆయన న్యాయవాది గోపాల్ను స్పాట్ తనిఖీ కోసం సిట్ పిలిపించింది. సిట్ రెండు రోజుల క్రితం హాసన్ జిల్లా హోలెనరసిపురలో ఎంఎల్ఎ నివాసంలో తనిఖీ నిర్వహించింది. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ కుమారుడైన రేవణ్ణ రెండు కేసులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి వంటమనిషిపై అత్యాచారానికి సంబంధించినది. ఆ కేసులో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ కూడా ఒక నిందితుడు. రె ..read more
Mana Telangana
42m ago
జార్ఖండ్ మంత్రి కార్యదర్శికి చెందిన నౌకరు గదిలో లెక్కల్లో చూపని కరెన్సీ నోట్ల గుట్టను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నౌకరు గదిలో నుంచి పెద్ద పెద్ద సంచుల్లో నోట్ల కట్టలను ఇడి అధికారులు బయటకు తీసుకువస్తున్న వీడియోలు, ఫోటోలు వర్గాలు షేర్ చేశాయి. అందులో కేంద్ర భద్రతా సిబ్బందిని కూడా చూడవచ్చు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగిర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ వద్ద పనిచేసే నౌకరు చెందిన గదిగా అధికార వర్గాలు తెలిపాయి. స్వాధీనం చేసుకున్న నోట్ల కట్టల విలువ కచ్ఛితంగా ఎంత ఉందన్న విషయం అధికారికంగా తెలియరానప్పటికీ రూ. 20 కోట నుంచి రూ. 30 ..read more
Mana Telangana
42m ago
ముంబై: ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గత నాలుగు రోజులుగా జరిగిన ఆపరేషన్లో రూ. 8.37 కోట్ల విలువచేసే 12.47 కిలోల బంగారాన్ని, ఎలెక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని, 10 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు సోమవారం ఒక అధికారి వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏప్రిల్ 29 నుంచి మే 2 ..read more
Mana Telangana
42m ago
చింద్వారా : ఉగ్రవాదుల దాడిలో శనివారం గాయాలపాలై మరణించిన భారత వైమానిక దళ (ఐఎఎఫ్ ) సైనికుడు కార్పొరల్ విక్కీ పహాడే మృతదేహం సోమవారం చింద్వారా లోని అతడి స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఐఎఎఫ్ కాన్వాయ్పై జమ్ముకశ్మీర్ లోని పూంచ్లో శనివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో విక్కీ మరణించారు.
సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విక్కీ సోదరి గీతా పహాడే మీడియాతో మాట్లాడుతూ “ నా సోదరుడిని చూసి గర్వపడుతున్నా. శనివార సాయంత్రం 6.30 ..read more
Mana Telangana
42m ago
బెంగళూరు: కర్ణాటకలో అమానుష సంఘటన వెలుగు చూసింది. భార్యాభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. వీరి వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి. ఉత్తర కన్నడ జిల్లా దండెలి తాలూకాలో నివసించే సావిత్రి, రవికుమార్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో ఆరేళ్ల వినోద్ మూగవాడు.
సావిత్రి ఇళ్లల్లో పనులు చేస్తూ జీవిస్తుండగా, భర్త రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తుంటాడు. తమ పెద్ద కొడుక్కి చెవులు వినబడక పోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం ఇదే గొడవలో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఓ కాలువలో పడేసింద ..read more